గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 28, సోమవారం నాడు సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీ లేఖ రాశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం సహా మొత్తం 16 భారతీయ భాషలలో 40,000 కు పైగా పాటల పాడారని, దేశ సినీ పరిశ్రమకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప సేవలు అందించారని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. గతంలో భారతరత్న అందుకున్న సంగీత పండితుల పేర్లను ప్రస్తావిస్తూ, అదేవిధంగా సంగీతానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలకు గుర్తుగా భారతరత్నను ప్రకటించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu