ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో జరుగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 2,3 తేదీల్లో కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజులపాటు సీఎం జిల్లాలో ఉంటున్నందున భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.
సీఎం జగన్ కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..
- డిసెంబర్ 2న ఉదయం 10:20 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.
- 11:15 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని 11:30 వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు.
- అనంతరం ప్రత్యేక విమానంలో 11:50 గంటలకు లింగాల మండలం సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12 గంటలకు రిజర్వాయర్ ప్రాంతంలో బోటింగ్ జెట్టీని ప్రారంభిస్తారు.
- ఆ తర్వాత వైఎస్సార్ లేక్ వ్యూ చేరుకొని 12:40 గంటలకు వైఎస్సార్ రెస్టారెంట్ ను ప్రారంభిస్తారు.
- ఇక కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజనుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు.
- అటుపై సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.
- స్థానిక నేతలతో కొద్దిసేపు చర్చించిన అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఇక డిసెంబర్ 3న ఉదయం 8:55 గంటలకు హెలికాఫ్టర్ లో పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
- ఆ తర్వాత రోడ్డు మార్గాన కదిరి రోడ్డులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు.
- అక్కడ 9:30 వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు.
- అనంతరం భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని 9:45 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి 10:10కి కడప విమానాశ్రయం చేరుకుంటారు.
- 10:15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకొని 11:30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసం చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE