ఏపీలో రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలి – వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం జగన్

CM YS Jagan Held Review Meet on Agriculture Department and Orders Officials Seeds and Fertilizers Should be Kept at All RBKs,CM YS Jagan Held Review Meet,Agriculture Department,Orders Officials Seeds,Fertilizers Should be Kept at All RBKs,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలని, అందులో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • మాండస్ తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు పరిహారం సిద్ధం చేయాలి.
  • రాష్ట్రంలో రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలి.
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయంతోనే రైతుల పని ముగియాలి.
  • ఆ తర్వాత ప్రక్రియ బాధ్యత అంతా ప్రభుత్వమే పర్యవేక్షించాలి.
  • ఒకవేళ దీనిలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లయితే ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్ ఏర్పాటు చేయాలి.
  • రైతుల ఫిర్యాదులపై సత్వరం స్పందించి తగు చర్యలు చేపట్టాలి.
  • వ్యవసాయ శాఖ అధికారులు ఈ వ్యవహారం మొత్తాన్ని దగ్గరుండి చూసుకోవాలి.
  • అన్ని ఆర్‌బీకే కేంద్రాలలో విత్తనాలు మరియు ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలి.
  • అలాగే ప్రతి ఆర్‌బీకే కేంద్రంలో సాయిల్ టెస్ట్ పరికరాలు అందుబాటులో ఉంచాలి.
  • రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సాయిల్ టెస్టింగ్ తర్వాత మ్యాపింగ్ జరగాలి.
  • తద్వారా ఎరువులు, రసాయనాల వినియోగం పరిమితంగా జరిగి రైతులకు పెట్టుబడి ఆదా అవడమే కాకుండా, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
  • ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ పైన కార్యాచరణ మరియు సాయిల్ టెస్టింగ్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చేపట్టాలి.
  • ఇక సాయిల్ టెస్టింగ్ తర్వాత రైతులకు సర్టిఫికెట్లు జారీ చేసి, ఫలితాల ఆధారంగా ఆయా భూముల్లో ఏఏ పంటలు పండించాలో వారికి సూచనలు అందించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here