తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన పలువురు నేతలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి, ఆమె భర్త వావిలాల వెంకట రమేష్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE