మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఫిబ్రవరి 20, గురువారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత 9 ఏళ్లుగా తన కుటుంబానికి చెందిన ఆస్తులను ప్రకటిస్తున్నట్టుగా లోకేష్ గుర్తు చేశారు. అలాగే దేశంలో మొత్తం 15 రాష్ట్రాల్లో హెరిటేజ్ పాల ఉత్పత్తులను విక్రయిస్తుమని, తమ సంస్థ ద్వారా 3వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. 9 రాష్ట్రాల్లో హెరిటేజ్కు ఆస్తులు ఉన్నాయని, రాజధాని అమరావతి ప్రాంతంలో హెరిటేజ్ కు ఆస్తులు లేవని స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులపై అనవసరంగా ఆరోపణలు చేసేవారు, ముందుగా తమ ఆస్తులను ప్రకటించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
నారా లోకేష్ ప్రకటించిన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు:
టీడీపీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబు ఆస్తులు:
- మొత్తం ఆస్తి 9 కోట్లు
- అప్పులు రూ.5.13 కోట్లు
- నికర ఆస్తి రూ.3.87 కోట్లు
- గత సంవత్సరంతో పోలిస్తే రూ.85 లక్షలు పెరుగుదల
నారా భువనేశ్వరి ఆస్తులు:
- ఆస్తి రూ. 53కోట్ల 37 లక్షల నుండి రూ.50 కోట్ల 62 లక్షలకు తగ్గుదల
- అప్పులు రూ.11.04 కోట్లు
నారా లోకేష్ ఆస్తులు:
- ఆస్తులు రూ.24.70 కోట్లు
- అప్పులు రూ.5.70 కోట్లు
- నికర ఆస్తులు రూ.19 కోట్లు
- గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల
నారా బ్రాహ్మణి ఆస్తులు
- ఆస్తులు రూ.15.68 కోట్లు
- అప్పులు రూ.4.17 కోట్లు
- నికర ఆస్తులు రూ.11.51 కోట్లు
- గత ఏడాదితో పోలిస్తే రూ. 3.80 కోట్లు పెరుగుదల
నారా దేవాన్ష్ ఆస్తులు:
- మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు( రూ.18 కోట్ల 71 లక్షల నుండి రూ. 19 కోట్ల 42 లక్షలు)
- గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షల పెరుగుదల
[subscribe]