ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం మరో ఏడాది పొడిగింపు

Andhra Pradesh State Govt Advisors Tenure, Andhra Pradesh State Govt Advisors Tenure to One More Year, AP CM YS Jagan, AP Govt Extends State Govt Advisors Tenure, AP Govt Extends State Govt Advisors Tenure to One More Year, AP State Govt Advisors, AP State Govt Advisors Tenure to One More Year, Mango News, State Govt Advisors Tenure, State Govt Advisors Tenure to One More Year, State Govt Advisors Tenure to One More Year In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం జూన్ 18వ తేదీతో, సీఎం వైఎస్ జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీ కాలం జూన్ 4తో, ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌ (కమ్యూనికేషన్స్‌) పదవీ కాలం జూన్ 7తో, ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురాం (కో ఆర్డినేటర్‌–కార్యక్రమాలు) పదవీ కాలం జూన్ 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా తేదీల నుంచి వారి పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 20 =