నేటినుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్’ ప్రారంభమైందని, ఇకపై అన్ని వైద్య సేవలూ గ్రామంలోనే అందుతాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైద్యరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఇంకా పలువురు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ విలేజ్ సెంటర్ ను పరిశీలించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసే ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్టు స్టాళ్ళను కూడా సందర్శించి పనితీరుపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం జగన్ సమీపంలోని కావూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభం సందర్భంగా.. సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..
- ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం.
- ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
- ఇకపై పేద ప్రజలు ఇకపై వైద్యం కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు.
- ఆస్పత్రులు, డాక్టర్లు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
- డాక్టర్లే గ్రామానికి వచ్చి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తారు.
- విలేజ్ క్లినిక్స్ లో దాదాపు 14 రకాల వైద్య సేవలు అందిస్తున్నాం.
- అన్ని విలేజ్ క్లినిక్స్ లో సీహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఉంటారు.
- ప్రతి 2వేల జనాభాకు ఒక విలేజ్ క్లినిక్, రెండు పీహెచ్సీలు ఉంటాయి.
- అలాగే ప్రతి పీహెచ్సీలో ఇద్దరు చొప్పున డాక్టర్లు ఉంటారు. ఒకరు పీహెచ్సీలో ఉంటే, మరొకరు అంబులెన్సులో ఉంటారు.
- దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వారికి డాక్టర్లు నేరుగా వారి ఇంటివద్దకు వచ్చి సేవలు అందిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE