భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలకు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ 43 ఏళ్ల బీజేపీ రాజకీయ ప్రస్థానంలో ఎందరో నిబద్దత కలిగిన నాయకుల, కార్యకర్తల త్యాగాలు ఉన్నాయని, వారి విశేష కృషి కారణంగానే పార్టీ పురోగమించిందని పేర్కొన్నారు. నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు హనుమాన్ జయంతిని కూడా ఘనంగా జరుపుకోవాలని, హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు కదనరంగంలో దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక బీజేపీ ప్రజాస్వామ్యం గర్భం నుండి ఆవిర్భవించిందని, అదే స్పూర్తితో నిరంతరం దేశ సేవకు పాటుపడుతుందని తెలిపారు. కాగా నేడు బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పార్టీ బూత్ స్థాయి నుంచి వివిధ కార్యక్రమాలను నిర్వహించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE