ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా సీఎం జగన్ సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ నిర్మాణం మరింత వేగవంతంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
సీఎం జగన్ ఆదేశాలు..
- నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి మొదటి ప్రాధానత్య ఇవ్వాలి.
- విశాఖలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలి. అలాగే జగనన్న కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలి.
- ఆప్షన్ ‘మూడు’ కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
- డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన, వాటి నాణ్యత విషయంలో దృష్టి సారించాలి.
- జగనన్న కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి మరియు సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్ను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశం.
- టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియనూ వేగవంతం చేయాలి.
- అర్హులకు 90 రోజుల్లో ఇంటిపట్టా అందించడమే కాకుండా లబ్ధిదారుని స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలని ఆదేశం.
- కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని కొత్తగా తేల్చామని, వీరిలో ఇప్పటికే లక్షమంది వరకు పట్టాలు అందించామన్న అధికారుల వివరణపై స్పందిస్తూ.. మిగిలిన వారికీ వీలైనంత త్వరలో పట్టాలు అందించాలని ఆదేశం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY