రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిందని, రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన సందర్భంగా రాష్ట్రానికి చేయూతనివ్వాలని సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర సమస్యలపై ఒక విజ్ఞాపన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అలాగే ఏపీ జెన్కోకు తెలంగాణ చెల్లించాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలని అన్నారు. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని సీఎం కోరారు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు.. అలాగే ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలని, కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ