ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు సంక్షేమ పథకాలతో పాలనలో తనదైన మార్కుని చూపిస్తూ.. మరోవైపు దృష్టి సారిస్తున్నారు. ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల పనితీరు పైన సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఇటీవలే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో వారిని నేరుగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమం రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా వారి నియోజకవర్గాల పరిధిలో దీనిలో పాల్గొనాలని, అలాగే గ్రామా మరియు వార్డు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన విషయం కూడా తెలిసిందే.
అయితే వీరిలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారికి ఇప్పటికే పనితీరు మెరుగు పరుచుకోవాల్సిందిగా హెచ్చరికలు చేసిన ఆయన ఇకపై మరింత కఠినంగా వ్యవహించాలని భావిస్తున్నారని సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా సీఎం జగన్ ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వనున్నారు. దీనిపై ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వారిపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ దక్కాలంటే పనితీరులో ప్రతిభ చూపిస్తేనే సాధ్యమని స్పష్టం చేయనున్నారని వారు వివరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY