మహాకవి, సంఘ సంస్కర్త, సాహితీకారుడు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. గురజాడను స్మరించుకుంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుని మరువదు ఈ తెలుగునేల’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సమాజంలో పరివర్తనకు ప్రయత్నించారు. గురజాడ రచించిన కన్యాశుల్కము నాటకం తెలుగు సాహితీలోకంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుని మరువదు ఈ తెలుగునేల.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ