తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర 25వ రోజుకు (సెప్టెంబర్ 21, మంగళవారం) చేరుకుంది. కామారెడ్డిలో జరుగుతున్న 25వ రోజు పాదయాత్రలో బండి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. మంగళవారం నాడు దేవాయిపల్లి, నిజాం సాగర్ క్రాస్ రోడ్ లో బహిరంగ సభ, భవాని పేట్ వరకు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించనున్నారు. 25వరోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా జోరువానలో సైతం బండి సంజయ్ ప్రజలతో మమేకమవుతూ, స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ పై సోమవారం బండి సంజయ్ స్పందించారు. తానూ వైట్, గ్రీన్, బ్లాక్, ఆరంజ్ ఇలా ఏ ఛాలెంజ్ కి అయినా సిద్ధమేనని, అక్టోబర్ 2 ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత టెస్టు కోసం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ప్రకటించారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ