జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (జూలై 16, శనివారం) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గంలో జరగనున్న జనసేన కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాగు నష్టాలతో, అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకున్న పలువురు కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను పవన్ కళ్యాణ్ అందజేయనున్నారు.
ముందుగా శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఇక మధ్యాహ్నాం 3 గంటలకు మండపేటలో జరిగే జనసేన కౌలు రైతు భరోసా సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అలాగే మార్గమధ్యంలో కొన్ని కౌలు రైతుల కుటుంబాలను పరామర్చించి, ఆర్థికసాయం చెక్కులను అందజేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY