ఆంధ్రప్రదేశ్ లో మరో 491 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 వేలు దాటింది. కొత్తగా నమోదైన 491 కేసులలో 390 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 83, విదేశాల నుంచి వచ్చిన వారు 18 మంది ఉన్నారు. దీంతో జూన్ 20, శనివారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8452 కు చేరింది. ఈ కేసుల్లో 6620 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 1832 మంది ఉన్నారు.
మరోవైపు కృష్ణాలో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, గుంటూరులో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 101 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 4111 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 4240 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 789
- చిత్తూరు – 515
- కర్నూల్ – 1247
- కడప – 330
- తూర్పుగోదావరి – 485
- పశ్చిమ గోదావరి – 498
- నెల్లూరు – 459
- ప్రకాశం – 175
- గుంటూరు – 742
- కృష్ణా – 982
- శ్రీకాకుళం – 59
- విజయనగరం – 78
- విశాఖపట్నం – 261
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 1506
- విదేశాల నుంచి వచ్చిన వారు: 326
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu