ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1155 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22, విదేశాల నుంచి వచ్చిన వారు ఒక్కరు ఉన్నారు. కొత్తగా నమోదైన 1178 కేసులతో కలిపి జూలై 7, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21197 కు చేరింది. గత 24 గంటల్లో 16,238 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన కర్నూల్ లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 252 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 7, ఉదయం 10 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 21197
కొత్తగా నమోదైన కేసులు : 1178
నమోదైన మరణాలు : 13
డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 9745
యాక్టీవ్ కేసులు : 11200
మొత్తం మరణాల సంఖ్య : 252
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu