ఏపీలో ఆగస్టు 15 న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ

Amaravati House plots Distribution, AP Govt House Plots Distribution, AP House Plots Distribution, AP House Plots Distribution Program Postponed, AP Minister Botsa Satyanarayana, House Plots Distribution In AP, House Plots Distribution Program, House Plots Distribution Program will be Held on August 15th, Minister Botsa

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 8 వ తేదీన జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించే తదుపరి తేదీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సోమవారం నాడు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆగస్టు 15 వ తేదీన దాదాపు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని చెప్పారు.

ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తుందని మంత్రి బొత్స విమర్శించారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు నాలుగు రిట్‌ పిటిషన్లు వేయగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వెంటనే రివ్యూ పిటిషన్‌ వేసే అవకాశం లేనందున జూలై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయలేక పోయామని, త్వరలోనే అనుమతులు తీసుకుని ఆగస్టు 15న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + fifteen =