ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 47,972 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,002 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 265, కడపలో 132, నెల్లూరులో 118, చిత్తూరులో 113, ప్రకాశంలో 86, కృష్ణాలో 74, గుంటూరులో 64 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,03,342 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 12 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు, నెల్లూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13735 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,508 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,75,448 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,159 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ