ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 135 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 23, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,212 కు, మరణాల సంఖ్య 14,486 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 164 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,60,400 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,326 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(135):
- చిత్తూరు – 35
- కృష్ణా – 23
- గుంటూరు – 18
- పశ్చిమగోదావరి – 15
- విశాఖపట్నం – 14
- నెల్లూరు – 9
- కడప – 8
- తూర్పుగోదావరి – 6
- అనంతపూర్ – 4
- శ్రీకాకుళం – 3
- ప్రకాశం – 0
- కర్నూల్ – 0
- విజయనగరం – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ