ఆర్టికల్-370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని వైసీపీ, టీడీపీ పార్టీలు స్వాగతించాయి. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, కశ్మీర్ ఎదురుకుంటున్న సమస్యకు మంచి పరిష్కారం చూపించారని చెప్పారు, ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ను కొనియాడారు. ఈ నిర్ణయంతో నరేంద్రమోడీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ఆర్టికల్-370 రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ పార్టీ సమర్థిస్తోందని చెప్పారు. దేశ జాతీయ జెండాను జమ్మూ కశ్మీర్ లో తగలబెట్టడం ఇంతకముందు చాలాసార్లు చూశామని, ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని చెప్పారు.
రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ లో ప్రజల ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషముగా ఉండేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన హక్కులు ఉండేలా చూడాలని టీడీపీ పార్టీ తరుపున కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. బిఎస్పీ, బీజేడీ, ఏఐఏడీఎంకే లాంటి ఇతర పార్టీలు కూడ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాయి.
[subscribe]
[youtube_video videoid=_FCgQneu8Pg]