ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,546 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 2, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 416, చిత్తూరులో 229, ప్రకాశంలో 201, కృష్ణాలో 158, నెల్లూరులో 151 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 1,968 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనాకు చికిత్స పొందుతూ రాష్ట్రంలో మరో 15 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 13410 కి పెరిగింది. గత 24 గంటల్లో 59,641 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 2,47,08,540 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 2, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 19,70,008
- కొత్తగా నమోదైన కేసులు : 1,546
- కొత్తగా నమోదైన మరణాలు : 15
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 19,36,016
- యాక్టీవ్ కేసులు : 20,582
- మొత్తం మరణాల సంఖ్య : 13410
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ