ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,15,275 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 18,972 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 2628, విశాఖపట్నంలో 1960, తూర్పుగోదావరిలో 1914, శ్రీకాకుళంలో 1732, చిత్తూరులో 1714, నెల్లూరులో 1337 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,63,994 కు చేరుకుంది.
ఇక కరోనా వలన తూర్పుగోదావరిలో తొమ్మిది మంది, విజయనగరంలో తొమ్మిది మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఏడుగురు, కర్నూల్ లో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు మరియు పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 8207 కి పెరిగింది. గత 24 గంటల్లో 10227 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 10,03,935 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,51,852 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ