ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 47,884 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 4,348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 932, విశాఖపట్నంలో 823, నెల్లూరులో 395, గుంటూరులో 338, కృష్ణాలో 296, విజయనగరంలో 290 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,92,227 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా శ్రీకాకుళం మరియు కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14507 కు చేరింది. గత 24 గంటల్లో 261 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,63,516 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,204 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,17,56,521 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ