ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి ఈరోజు భేటీ అయ్యారు. ఈ కీలక భేటీపై సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సినిమా పరిశ్రమ తరపున మాట్లాడడానికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తో చిరంజీవి సమావేశం అయ్యారని చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను, చిరంజీవి చర్చించుకున్నామని తెలిపారు. అయితే, చిరంజీవి సీఎంతో భేటీకి నన్ను కూడా ఆహ్వానించారని అన్నారు. కానీ, ‘బంగార్రాజు’ మూవీ ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండటంతో రాలేనని చెప్పినట్లు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ భేటీ వలన అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు నాగార్జున. కాగా, గురువారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు చిరంజీవి. అక్కడినుంచి కారులో నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. అక్కడ భేటీ సమయంలో సీఎంతో కలిసి లంచ్ చేశారు. భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ