జనవరి 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్ల కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాక్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 3 కోట్ల మంది టీనేజర్స్ కు వ్యాక్సిన్ వేసినట్టు గురువారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అలాగే అర్హతగల టీనేజర్స్అంతా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు జనవరి 13, గురువారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 154.61 కోట్లు (1,54,61,39,465) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 76 లక్షల మందికిపైగా (76,32,024) వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు పేర్కొన్నారు. ఇక ప్రికాషన్ డోస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కింద ఇప్పటివరకు 12,31,290 మంది హెల్త్కేర్ వర్కర్స్, 8,02,342 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ మరియు 60 ఏళ్లు పైబడినవారు 6,39,753 కలిపి మొత్తం 26,73,385 మందికి వ్యాక్సిన్ అందించినట్టు తెలిపారు.
Great sense of responsibility & enthusiasm among Young India👏
Over 3 crore youngsters between the 15-18 age group have received 1st dose of the #COVID19 vaccine 💉
I appeal to all my eligible young friends to get vaccinated at the earliest.#SabkoVaccineMuftVaccine pic.twitter.com/TewKNd4pIf
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 13, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ