ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 462 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 407 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 40, విదేశాల నుంచి వచ్చిన వారు 15 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 462 కేసులతో కలిపి జూన్ 23, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9834 కు చేరింది. గత 24 గంటల్లో 20639 సాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 7858 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 1976 మంది ఉన్నారు.
మరోవైపు కృష్ణాలో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, గుంటూరు లో ఒకరు మరియు కడపలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 119 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 4592 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 5123 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 938
- చిత్తూరు – 617
- కర్నూల్ – 1407
- కడప – 454
- తూర్పుగోదావరి – 706
- పశ్చిమ గోదావరి – 635
- నెల్లూరు – 484
- ప్రకాశం – 192
- గుంటూరు – 852
- కృష్ణా – 1096
- శ్రీకాకుళం – 60
- విజయనగరం – 91
- విశాఖపట్నం – 326
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 1624
- విదేశాల నుంచి వచ్చిన వారు: 352
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu