ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5795 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 5795 కేసులతో కలిపి అక్టోబర్ 6, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 7,29,307 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 65,889 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన కృష్ణాలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6052 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 6,72,479 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 6046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 50776 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu