ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎం.గురుమూర్తి బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్ కు గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఇప్పటికే వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మార్చి 23న ఈ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఏప్రిల్ 17 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ