భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 6, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,082 కు, మరణాల సంఖ్య 1,03,569 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 61,267 కరోనా పాజిటివ్ కేసులు, 884 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 56 లక్షలు దాటింది. ఒకే రోజులో 75,787 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 56,62,490 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 84.7 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.
ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 9,19,023 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 8 కోట్లు దాటింది. అక్టోబర్ 5 నాటికీ 8,10,71,797 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 10,89,403 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu