ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7553 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7553 కేసులతో కలిపి సెప్టెంబర్ 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 6,39,302 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 68,829 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరులో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, మరియు శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5461 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 5,62,376 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 10555 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 71465 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu