ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 727 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 32, విదేశాల నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 765 కేసులతో కలిపి జూలై 4, శనివారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17699 కు చేరింది. గత 24 గంటల్లో 24,962 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కరోనా వలన కర్నూల్ లో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 218 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 8008 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7453 మంది ఆసుపత్రుల్లో, 2020 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 9473 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 04/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 15,141 పాజిటివ్ కేసు లకు గాను
*6437 మంది డిశ్చార్జ్ కాగా
*218 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8486#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QWvPvQ7kr7— ArogyaAndhra (@ArogyaAndhra) July 4, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu