ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 4,577 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మీడియా బులెటిన్ లో పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో విశాఖపట్నం జిల్లాలో 2, ఏలూరు జిల్లాలో 2, అనంతపురంలో 1, బాపట్లలో 1, ప్రకాశంలో 1, తిరుపతిలో 1 కేసు నమోదయ్యాయి. మిగతా 20 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదని, గత 24 గంటల్లో నలుగురు కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని తెలిపారు. ఇక ఏప్రిల్ 29 నాటికీ ఏపీలో మొత్తం 3,35,35,691 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ