తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం కలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్తో సమావేశం ముగిసిన అనంతరం ప్రగతి భవన్ వద్ద మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి చేపట్టినందుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పారు రోజా. తనను కుటుంబంతో కలిసి ఒకసారి ప్రగతి భవన్కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని.. ఆయన కోరిక మేరకే ఈరోజు సీఎం కేసీఆర్ను కలిశానని తెలిపారు.
సీఎం కేసీఆర్ తనని కూతురిలా ట్రీట్ చేస్తారని, అందుకే మంత్రి అయిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చానని మంత్రి రోజా స్పష్టం పేర్కొన్నారు. కాగా మొదటినుంచి సీఎం కేసీఆర్తో రోజాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంతకుముందు కేసీఆర్ ఒకసారి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయనను తమ ఇంటికి ఆహ్వానించారు రోజా. ఆమె కోరిక మన్నించి తిరుగు ప్రయాణంలో కేసీఆర్ రోజా ఇంటికి వచ్చి, భోజనం చేసి వెళ్లారు. ఇటీవల రోజా యాదాద్రి దర్శనానికి వచ్చినప్పుడు కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ