ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8096 పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 18, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,09,558 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 5244 కి పెరిగింది. మరో 11803 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 74,710 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన కడప జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు మరియు కర్నూల్ లో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5244 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 18, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 49,59,081
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 6,09,558
- కొత్తగా నమోదైనా కేసులు : 8096
- నమోదైన మరణాలు : 67
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 5,19,891
- యాక్టీవ్ కేసులు : 84423
- మొత్తం మరణాల సంఖ్య : 5244
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu