ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7 లక్షల 35 వేలు దాటింది. కొత్తగా 5529 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 7,35,638 కు చేరుకుంది. రాష్ట్రంలో మరో 3676 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 17, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,79,146 కు చేరుకున్నట్టు ప్రకటించారు. మొత్తం కేసుల్లో 7,76,251 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2895 మంది ఉన్నారు. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 6406 కి చేరింది. ప్రస్తుతం 37102 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 109611
- పశ్చిమ గోదావరి – 78603
- చిత్తూరు – 73197
- అనంతపూర్ – 62268
- గుంటూరు – 61852
- కర్నూల్ – 58727
- నెల్లూరు – 57929
- ప్రకాశం – 56248
- విశాఖపట్నం – 53588
- కడప – 49597
- శ్రీకాకుళం – 42438
- విజయనగరం – 38098
- కృష్ణా – 34095
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu