రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను మరో పదిరోజులు అనగా జూన్ 20 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో కర్ఫ్యూ పొడిగింపు నేటి నుంచే అమల్లోకి రానుంది. కర్ఫ్యూ అమలులో భాగంగా ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సడలింపు ఇవ్వగా, నేటి నుంచి ఆ సడలింపు సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జూన్ 20 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యవసర సేవలనే అనుమతించనున్నారు. ప్రజలంతా సహకరించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ