ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది పురస్కారాలు ప్రకటించింది. ఈ మేరకు తెలుగు మరియు సంస్కృత అకాడమీ 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన పలువురికి ఈ అవార్డులను ప్రకటించింది. రేపు నాగార్జున యూనివర్సిటీ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి మేరుగు నాగార్జున మరియు మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పురస్కరాలకు ఎంపికైనవారికి వీరు అవార్డులను అందించనున్నారు. ఇక వివిధ విభాగాల కింద మొత్తం ఏడుగురు ఈ ఉగాది అవార్డులకు ఎంపికయ్యారు.
తెలుగు మరియు సంస్కృత అకాడమీ ప్రకటించిన వివరాల ప్రకారం..
- సైన్స్ అండ్ టెక్నాలజీ – పి. గోపీకృష్ణ
- వైద్య రంగం – డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే
- ఫైన్ ఆర్ట్స్ – శ్రీమతి. పసుమర్తి పావని
- జానపద మరియు నాటక రంగం – కూరటి సత్యం నాయుడు
- వ్యవసాయ రంగం – వి. గోపీచంద్
- సామజిక సేవా విభాగం – మాదిరెడ్డి కొండారెడ్డి
- ప్రత్యేక వర్గం (చిత్రకళ) : ఆర్. సుభాష్ బాబు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE