తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో డిజిటల్ వేదికగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశనం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం. మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే ‘డిజిటల్ మహానాడు-2021’లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు, తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. డిజిటల్ మహానాడు 2021ను విజయవంతం చేయండి” అని చంద్రబాబు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ