ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ మూడేళ్లలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రభుత్వ తీరుని ప్రజలకు చాటిచెప్పేందుకు చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై రేపు వర్క్షాప్ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ నిర్వహించనున్న వర్క్షాపుకు హాజరు కావాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు అందరికీ ఇప్పటికే ఆదేశాలు అందాయి.
మే 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్లు ఇంటింటికీ వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వడం ద్వారా వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ప్రారంభంలో సీఎం జగన్ సూచించారు. ఈ క్రమంలో కార్యక్రమం ప్రారంభం అయ్యి దాదాపు ఒక నెల కావొస్తున్న నేపథ్యంలో.. దీనిలో సాధించిన పురోగతిపై సమీక్ష చేయనున్నారు సీఎం జగన్. తద్వారా ప్రజల స్పందన తెలుసుకోవడం, ప్రభుత్వం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై సమీక్షలో చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF