విజయవాడలో నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ యువతి మెడపై తీవ్రగాయాలవడంతో స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. యువతిపై దాడి చేసిన అనంతరం ఉన్మాది తనను తానే కత్తితో గాయపర్చుకున్నాడు. తనను ప్రేమించడం లేదనే నెపంతోనే యువతి ఇంటికెళ్లి ఈ దాడికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన స్వామి అనే ఉన్మాది స్థానికంగా కార్పెంటర్గా పనిచేస్తునట్టుగా సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu