దేశంలో గత కొన్నిరోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 67,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం 81,514 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్తగా నమోదయిన కేసులలో దేశంలోని కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండే 77 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 77 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 10552
- కర్ణాటక – 9265
- కేరళ – 6244
- మధ్యప్రదేశ్ – 5515
- తమిళనాడు – 4462
- ఆంధప్రదేశ్ – 3892
- వెస్ట్ బెంగాల్ – 3677
- ఢిల్లీ – 3324
- ఛత్తీస్ గడ్ – 2830
- ఒడిశా – 2673
మరోవైపు గత 24 గంటల్లో 680 మరణాలు నమోదవగా దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 80 శాతం నమోదయ్యాయి.
680 మరణాల్లో 80 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 158
- కర్ణాటక – 75
- వెస్ట్ బెంగాల్ – 64
- తమిళనాడు – 52
- ఢిల్లీ – 44
- ఉత్తరప్రదేశ్ – 41
- ఛత్తీస్ గడ్ – 33
- పంజాబ్ – 31
- ఆంధప్రదేశ్ – 28
- కేరళ – 20
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu