సూపర్ స్టార్ రజినీకాంత్పై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభకు హాజరైన రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను బ్లాక్ మెయిల్ చేసి తనవైపుకు తిప్పుకోవడానికే చంద్రబాబు నాయుడు రజినీకాంత్ను ఏపీకి పిలిపించారని, టీడీపీ అవకాశవాద రాజకీయాలను ఇప్పటికైనా పవన్ అర్ధంచేసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ చివరిదశలో ఉండగా ఆయనను బాధపెట్టిన వారంతా కలిసి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని, దీనిని చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్ పైన చెప్పులు వేసిన సమయంలో.. రజినీకాంత్ చంద్రబాబుకు మద్దతు తెలిపారని, అలాంటి వ్యక్తి ఈరోజు ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రజినీకాంత్ చదివారని, ఆయనకు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE