ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (జులై 12, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ముతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. అలాగే మంగళవారం సాయంత్రం విజయవాడ గేట్వే హోటల్లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే సమావేశంలో ద్రౌపది ముర్ము పాల్గొని రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరనున్నారు.
ముందుగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు తెలుపుతున్నట్టుగా సోమవారం నాడు టీడీపీ ప్రకటించింది. దేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం లభించడం మంచి పరిణామమని, సామాజిక న్యాయానికి టీడీపీ మొదటి నుంచి కట్టుబడి ఉంటుందని, ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చంద్రబాబు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY