ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా స్కూళ్లు ప్రారంభాన్ని నవంబర్ 2 కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా స్కూల్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని అక్టోబర్ 5 న నిర్వహించాలని భావించారు. 5 వ తేదీన జరగాల్సిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా ఏపీ పాఠశాల విద్య సంచాలకుడు చిన వీరభద్రుడు తాజాగా ప్రకటించారు. మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ కిట్ల పంపిణీ సందర్భంగా విద్యార్థుల తల్లులను బయోమెట్రిక్ నమోదు నుంచి మినహాయించాలని ఉపాధ్యాయ సమాఖ్య, ఇతర సంఘాలు కోరాయి. అలాగే కిట్ల పంపిణిని వాయిదా వేసినప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించాలని వారు కోరారు. ఇక ‘జగనన్న విద్యా కానుక’ కిట్ల పంపిణి తేదీని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu