కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకింది. ఇటీవలే కోవిడ్ -19 బారిన పడిన ఆమెకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోనియా గాంధీ కోవిడ్ అనంతర లక్షణాలతో ప్రముఖ గంగారాం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, గురువారం ఏఐసీసీ కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నియమితులైన జైరాం రమేష్ హెల్త్ అప్డేట్ను ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ కారణంగా దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడిందని, సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో జూన్ 8న తన ముందు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీకి సమన్లు పంపింది. అయితే ఆమెకు కోవిడ్-19 సోకిన నేపథ్యంలో.. జూన్ 23న హాజరు కావాలంటూ మరోసారి ఆమెకు ఈడీ సమన్లు పంపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ