జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం రేపు (ఏప్రిల్ 5, మంగళవారం) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటుగా పి.ఏ.సి.సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, విభాగాల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జిలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పాలన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, రైతులు వ్యవసాయ స్థితిగతులు, వచ్చే కొద్ది నెలల్లో పార్టీ చేపట్టవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ