కాపు రిజర్వేషన్ కోసం మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య చేస్తున్న దీక్షపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. హరిరామజోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగినట్టు తెలుసుకున్నట్టు తెలుస్తుంది.
“కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. 85 సంవత్సరాల వయసులో హరిరామజోగయ్య దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నాను. హరిరామజోగయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం, బాధ్యులు తక్షణం చర్చలు చేపట్టాలి” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది.
కాగా కాపు రిజర్వేషన్ల సాధన కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఆయన నివాసం వద్దే సోమవారం ఉదయం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టేందుకు హరిరామజోగయ్య సిద్ధమయ్యారు. అయితే ఆదివారం రాత్రి పోలీసుల హరిరామజోగయ్యను అదుపులోకి తీసుకుని అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏలూరు ఆసుపత్రిలో కూడా హరిరామజోగయ్య తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యం తీసుకునేందుకు హరిరామజోగయ్య నిరాకరిస్తుండడంతో ఏలూరులో ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తత నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE