గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందని సీఎం అన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేలు చొప్పున సీఎం వైఎస్ జగన్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.
ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్, టీడీపీ ఆధ్వర్యంలో గుంటూరులోని వికాస్ హాస్టల్ గ్రౌండ్ లో ఆదివారం సాయంత్రం జరిగిన జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ లో పేదలకు సంక్రాంతి కానుకలు, జనతా వస్త్రాలు పంపిణీ సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురు గాయపడ్డారు. ఒక మహిళా సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కార్యక్రమానికి ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరై కార్యక్రమానికి కొందరికి కానుకలు అందించారు. చంద్రబాబు ప్రసంగించిన తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైనా ప్రజలకు కానుకల పంపిణీ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE