దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ 4.0 మే 31 వ తేదీతో ముగియనుండటంతో భవిష్యత్ కార్యాచరణ, లాక్డౌన్ పొడిగింపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మరికొన్ని రోజులపాటు లాక్డౌన్ పొడిగింపు ప్రతిపాదనలపై మే 28, గురువారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకునట్టు తెలుస్తుంది. ఏ రంగాలకు ఇంకా మినహాయింపులు అవసరం, రాష్ట్రాల్లో తాజా కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రులతో ఫోన్ లో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ చర్చలో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపినట్లు సమాచారం. లాక్డౌన్ 5.0 పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి.
మరోవైపు భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 29, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4706 కి చేరింది. కరోనా బాధితుల్లో 71,106 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 89,987 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu