తిరుపతి ఉపఎన్నికపై ఒక అవగాహనకు వచ్చాం, త్వరలో పూర్తి స్పష్టత: పవన్ కళ్యాణ్

Candidate for Tirupati Lok Sabha By-election, Janasena, janasena chief pawan kalyan, Janasena Party Tirupati Lok Sabha, Janasena Pawan Kalyan, Mango News, pawan kalyan, Pawan Kalyan On Party Tirupati Lok Sabha, Tirupati, Tirupati bypoll, Tirupati Bypoll Candidate, Tirupati bypoll janasena, Tirupati Bypoll News, Tirupati Lok Sabha, Tirupati Lok Sabha By-election

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గురువారం నాడు తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

“తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాం. మరో రెండు మూడు సమావేశాల అనంతరం పూర్తి స్పష్టత వస్తుంది. టిక్కెట్టు ఏ పార్టీకి దక్కినా జనసేన-భాజపా కూటమి బలపడాలనే ధ్యేయంతో అందరూ పని చేయాలి. చిన్నచిన్న సమస్యలు తలెత్తినా సరిదిద్దుకొని ముందుకెళదాం. తిరుపతి వచ్చినప్పటి నుంచి కలిసిన వారంతా తిరుపతి మనకు బలమైన స్థానం, మనమే పోటీ చేయాలంటున్నారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకున్నారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =